హైదరాబాద్, బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐజీ ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని మంగళవారం హైకోర్టులో ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ముందస్తు బెయిల్ ఇస్తే వారంలోపు విచారణకు వస్తారని ప్రభాకర్ రావు న్యాయవాది కోర్టు కు తెలిపారు. దీంతో కేసు విచారణను కోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది.
