- అంబేద్కర్ ఆశయాలను సాధించాలి
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిఐ సంపత్ కుమార్ సోమవారం ఘన నివాళులర్పించారు. సంపత్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసమే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరి హక్కు కల్పించేందుకు ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ ప్రజల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటాలను ప్రపంచానికి ఆదర్శమని ఆయన ఆశయాలను సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డప్పు రవి భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు, శ్రీరామ్ వెంకటేష్, రాజాబాబు గౌడ్, అంబాల మల్లేశం ,శ్రీధర్ రెడ్డి, సాయి నిఖిల్, చైతన్య పాల్గొన్నారు.
