ఇందూర్, బతుకమ్మ : పవర్ హౌస్ కాంపౌండ్ లో గల డి 1 సెక్షన్ లో ఉన్న 8 ఎంవిఏ ట్రాన్స్ఫర్మర్ స్థానంలో 12.5 ఎంవిఏ ట్రాన్స్ఫర్మర్ ను బిగించారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని సరఫరా లో అంతరాయం లేకుండా చేయాలని కంపెనీ సిఎండి ఆదేశాల మేరకు అధిక సామర్థ్యం గల ట్రాన్స్ఫర్మర్ ను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం లో ఎస్ఈ రవీందర్, డిఈ శ్రీనివాస్, ఎంఆర్ టి డిఈ వెంకటరమణ, టౌన్ 1 ఏడిఈ చంద్రశేఖర్, ఎస్పిఎం ఏడి నటరాజ్, టిఆర్ ఏఈ సాయిలు, డి 8 ఏఈ బాబా శ్రీనివాస్, డి 1 ఏఈ నగేష్, సిబ్బంది పాల్గొన్నారు.

