కామారెడ్డి, బతుకమ్మ: గౌడ కులస్తులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి సర్దార్ పాపన్న మహరాజ్ చరిత్రను ప్రచారం చేయించే బృహత్తరమైన బాధ్యత గుర్తు చేసేందుకు “పాపన్న మహరాజ్ ఆత్మ బలిదాన దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ అన్నారు.
కామారెడ్డి పట్టణంలోని జై గౌడ ఉద్యమం కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్న కార్యక్రమానికి భారీ సంఖ్యలో గౌడ సోదరులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
పాపన్న లేకుంటే గౌడ సమాజానికి గౌరవం లేదని, పాపన్న లేకుంటే భవిష్యత్ లేదన్నారు. పాపన్న మహారాజ్ వారసులమని చెప్పేందుకు గర్వపడాలన్నారు. సమావేశంలో జై గౌడ ఉద్యమం ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఇందూరి సిద్ధ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
