నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాలలో మంగళవారం నుండి ఎల్.ఎల్.బి.,ఎల్ ఎల్ ఎం మూడవ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను వైస్ ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు ఆకస్మిక తనిఖీ చేసి పరీక్షల ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసినారు. ఈ తనిఖీల్లో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసన్న రాణి, అడిషనల్ కంట్రోలర్ డా. టి.సంపత్ లు పాల్గొన్నారు. ఈ పరీక్షలకు 42 మంది విద్యార్థులకు 33 మంది విద్యార్థులు హాజరయ్యారు. 9 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
