హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రం ప్రభుత్వం భారీగా ఐపీఎస్ లను బదిలీ చేసింది. ఈ మేరకు 21మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ డీజీలతో పాటు ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డిఐజీలను బదిలి చేసింది. నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య, కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం, కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్ర, ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహజన్, సంగారెడ్డి ఎస్పీగా పంపకజ్ పరితోష్, వరంగల్ సీపీగా సనప్రీత్ సింగ్, ఇంటలిజెన్స్ ఎస్పీగా సిందూశర్మ, భువనగిరి ఎస్పీగా అకాంక్ష్ యాదవ్, సిరిసిల్ల ఎస్పీగా గీతె మహేష్ సాహెబ్, మంచిర్యాల డీసీపీగా భాస్కర్, పెద్దపల్లి ఎస్పీగా కరుణాకర్, సెంట్రల్ జోన్ సీపీగా కల్పవల్లి, సూర్యపేట ఎస్పీగా నర్సింహా, సీఐడీ ఎస్పీగా రవీందర్, రామగుండం ఎస్పీగా అంబర్ కిషోర్ జా నియామకం అయ్యారు.

