నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : లైన్ మెన్ దివస్ సందర్భంగా మంగళవారం లైన్మెన్ లను ఘనంగా సత్కారించారు. నిజామాబాద్ రూరల్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో పవర్ హౌస్ లో ని మీటింగ్ హాలులో ఆర్టిజన్, అన్ మ్యాన్ , జేఎల్ఎం ,ఎల్ ఎం, ఎల్ ఐ, ఎస్ ఎల్ ఐ లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిచ్పల్లి డి.ఈ ఆపరేషన్ జడ్.ఉత్తమ్, సభ అధ్యక్షుడు నిజామాబాద్ రూరల్ ఏడిఈ ఆపరేషన్ ఆర్.బాలేష్ కుమార్ వహించారు. .ఈ సందర్భంగా డి ఈ మాట్లాడుతూ నిత్యం నాణ్యమైన, అంతరాయంలేని విద్యుత్ సరఫరా అందించేందుకు, పంపిణీ లైన్లు నిర్వహించేందుకు, అత్యవసర సేవలకు స్పందించేందుకు, వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు,అలాగే వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు మనo ముందుకు సాగాలిఅన్నారు. ఏడిఈ మాట్లాడుతూ ఈ లక్ష్య సాధనలో మీ పాత్ర ఎంతో కీలకం అన్నారు. ఈ సందర్భంగా, సంస్థకు లైన్మెన్లు అందిస్తున్న అమూల్యమైన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఈ లు రాజేందర్, పి.శ్రీనివాస్, నాగ షేర్వాణీ,భాస్కర్, శంకర్ గౌడ్, ప్రవీణ్ కుమార్, సబ్ ఇంజనీర్ కుమారి దివ్య, భారత్, సీనియర్ లైన్స్పెక్టర్ లైన్ ఇన్స్పెక్టర్ లు, లైన్మెన్లు , అసిస్టెంట్ లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, ఆర్టిజన్లు, అన్ మ్యాన్ కార్మికులు పాల్గొన్నారు.
- వర్నిలో..
వర్ని సెక్షన్లో ఏ ఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జలాల్పూర్ విద్యుత్ ఉపకేంద్రంలో ఆర్టిజన్, అన్ మ్యాన్ , జేఎల్ఎం ,ఎల్ ఎం, ఎల్ ఐ, ఎస్ ఎల్ ఐ లకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోధన్ డి ఈ ఆపరేషన్ ఎండి ముక్తార్, అతిథులుగా బోధన్ ఏడిఈ ఆపరేషన్ కె. నగేష్ కుమార్, ఏడిఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్ పాల్గొన్నారు .ఈ సందర్భంగా డి ఈ ముక్తార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఏఈ ఆపరేషన్ వర్ని శ్రీనివాస్, ఏఈ కన్స్ట్రక్షన్ బోధన్ సుమిత, సబ్ ఇంజనీర్ బాలకిషన్, సీనియర్ లైన్స్పెక్టర్ వేణుగోపాల్, లైన్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, రాజేంద్ర, లైన్మెన్లు చిన్నబాబు, రాములు, సంతోష్, రామచందర్, వసంత్, అసిస్టెంట్ లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, ఆర్టిజన్లు, అన్ మ్యాన్ కార్మికులు పాల్గొన్నారు.

