వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలోని ఎస్ఎల్బీసీ( శ్రీశైలం బకింగ్ కెనాల్) టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు. ప్రమాదం చోటు చేసుకున్నప్పటి నుంచి అధికారులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రుల ఆచూకీ కోసం గాలించాయి. మూడు మీటర్ల లోతు గల మట్టిలో వారు కూరుకుపోయినట్లు ఆధునాతన పరికరాలు సూచించాయి. రక్షణ బృందాలు ఆచూకీ కనుగొని, బాధితుల మృతదేహాలను వెలికితీసేందుకు శ్రమిస్తున్నాయి.
