వెబ్ న్యూస్, బతుకమ్మ : డిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ సన్నివేశం పలువురిని ఆకర్షించింది. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరాదా మాట్లాడుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ఆహార్యాన్ని చూసి మోదీ ..హిమాలయాలకు వెళ్తున్నావా పవన్.. ?అని ప్రశ్నించారు. దాంతో అక్కడ ఉన్న నేతల ముఖాల్లో చిరునవ్వులు విరబూశాయి. ఈ దృశ్యాలు (modi-pawankalyan) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
