వెబ్ న్యూస్, బతుకమ్మ : బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ భారత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి రిషి సునాక్ కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోలను ‘ఎక్స్’ వేదికగా మోదీ షేర్ చేశారు. రిషి సునాక్ కుటంబ సభ్యులను కలవడం సంతోషంగా ఉందన్నారు. ఈబేటీలో తమమధ్య అద్భుతమైన సంభాషణ జరిగిందని మోదీ అన్నారు. ఇరు దేశాల సంబంధాలు బలపడాలని తపన కలిగిన వ్యక్తి రిషి అంటూ మోదీ ప్రశంసించారు. రిషి వెంట ఆయన సతీమణి అక్షతామూర్తి, ఇద్దరు కుమర్తెలు, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఉన్నారు.
ప్రధాని మోదీని కలిసిన రిషి సునాక్ కుటుంబం
