మాక్లూర్, బతుకమ్మ: మండల పరిషత్ కు ఇంచార్జీ అదికారిగా లక్ష్మారెడ్డి సోమవారం బాద్యతలు తీసుకున్నారు. ఇన్నాళ్ళు శిక్షణలో ఉన్న ఐఎఎస్ అధికారి మండలాదికారిగా వ్యవహరించారు. ప్రస్తుతం రెవిన్యూ వైపు శిక్షణకు జిల్లా కలెక్టర్ పంపడంతో ఎండిఓ పోస్టు ఖాళీ ఏర్పడింది. ఇందల్వాయి మండలంలో పర్యవేక్షకునిగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మరెడ్డి ఈ మధ్యే బదిలీపై మాక్లూర్ కు వచ్చారు. ఐఎఎస్ శిక్షణ అధికారి ఎండిఓ పోస్టు నుంచి తప్పుకోవడంతో పర్యవేక్షకుడు లక్ష్మారెడ్డి కలెక్టర్ ఆదేశాల మేరకు బాద్యతలు స్వీకరించారు.
