29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

దొంగతనాల పట్ల వస్త్ర వ్యాపారులు అప్రమత్తంగా ఉండండి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ వస్త్ర వ్యాపారులు దొంగతనాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ ఎసిపీ రాజా వెంకట్ రెడ్డి సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా గురువారం నగరంలోని జవహర్ రోడ్డులోని వస్త్రభవన్ లో వ్యాపారులకు అవగాహన కార్యక్రమం నిజామాబాద్ వన్ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి అధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైనా ఎసిపీ రాజావెంకట్ రెడ్డి మాట్లాడుతు వ్యాపారులు తమ దందా నిర్వహణ విషయంలో ప్రత్యేకంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, నగదు, బంగారం లాంటివి సేఫ్లో మంచి లాకర్ లలో భధ్రపరుచుకోవాలని అన్నారు. బంగారం, నగదు తరలించే వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. షాపులలో అలారం బటన్ అమర్చుకోని వాటిని పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేయాలని అన్నారు. చోరీలపై, ఆన్ లైన్, సైబర్ మోసాల పట్ల పని చేసే సిబ్బందికి కూడా అవగాహన కల్పించాలని అన్నారు.

More articles

Latest article