29 C
Hyderabad
Monday, August 3, 2026

స్మశాన వాటిక హద్దులు చూపించాలని తహసీల్దార్ కు వినతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని గోపాల్ పేట్ గ్రామానికి చెందిన మాదిగ కులస్తుల స్మశాన వాటికకు దారిని చూపించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గోపాల్ పేట్ మాదిగ కులస్తులు మాట్లాడుతూ గతంలో పెద్దలు కేటాయించిన స్మశాన వాటికను ఇరువైపులా ఉన్నవారు ఆక్రమిస్తున్నారని, మాదిగ కులస్తుల స్మశాన వాటికకు దారి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. స్మశాన వాటికను ఆక్రమించుకోకుండా మాదిగల స్మశాన వాటిక యొక్క హద్దులను చూపించాలని, ఉపాధి హామీ ద్వారా రోడ్డును నిర్మించాలని కోరుతూ తహసిల్దార్  శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ కులస్తులు ఆత్మకూరు బాబురావు, రాములు, గోపి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article