నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అత్యధిక శబ్ధంతో పాటలు పెట్టి ఆటో నడిపిన ఒకరికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు ఒకటో టౌన్ ఇన్స్ పెక్టర్ రఘుపతి తెలిపారు. బుధవారం తెల్లవారుజామున నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద ఆటోనగర్ కు చెందిన ముజామిల్ తన ఆటోలో అత్యధిక శబ్ధంతో పాటలు పెట్టి ఇతరులకు ఆటంకం కలిగించారు. అక్కడే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఒకటో టౌన్ ఇన్స్ పెక్టర్ బి.రఘుపతి ఆటో డ్రైవర్ ముజామిల్ ను అదుపులోకి తీసుకున్నారు. ముజామిల్ ను సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుచగా ఒక రోజు జైలు శిక్ష విధించారు. ఆటో డ్రైవర్ ను రిమాండ్ కు తరలించినట్లు ఒకటో టౌన్ ఇన్స్ పెక్టర్ బి.రఘుపతి తెలిపారు.
