నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నీరడి నాగు కి రూ. 38,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి కృషి ద్వారా ఈ చెక్కు మంజూరు కాగా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్ చెక్కును మంగళవారం బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ధమ్మాయి శ్రీను, నిరడి సంతోష్, భోజన్న, ఆనంద్, నరేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
