బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో సోమవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజాంసాగర్ ప్రాజెక్టు సీఈ శ్రీనివాస్, ఎస్ సీ రాజశేఖర్, ఈఈ బలరాం, డీఈ లు జగదీష్, శ్రావణ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ తహసీల్దారులు, ఇరిగేషన్ ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.

