26.2 C
Hyderabad
Monday, August 3, 2026

చర్చిని ధ్వంసం చేసిన 9మంది అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా దేవునిపల్లి మండలంలోని గూడెం గ్రామంలో ప్రార్థనల కోసం నిర్మించిన చర్చని ధ్వంసం చేసిన 9మందిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి అసిస్టెట్ సూపరింటెండెంట్ బి.చైతన్య రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మత విశ్వాసాలను రెచ్చగెట్టే విధంగా రాతలు రాసి చర్చిని ధ్వంసం చేశారని తెలిపారు. ఈ ఘటనపై దేవునిపల్లి సీఐ, ఎస్ఐ విచారణ జరిపి 9మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇకముందు ఎవరైనా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More articles

Latest article