బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని అహ్మద్ బి.ఎడ్ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని” మహిళా ఉపాధ్యాయ దినోత్సవం” గా జరుపుకోవడం జరిగింది. ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.డి. హనీఫ్ పాషా మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతీయ సంఘసంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి ఆమె నిమ్మ వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన జ్యోతిరావు పూలే భార్య కులమత బేధాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ముఖ్యంగా మహిళల అక్షరాస్యత, విద్యాభివృద్ధికి మరియు మహిళలకు చెందిన హక్కుల గురించి కృషి చేసినదిగా పేర్కొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
