నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) 2025 డైరీ, క్యాలెండర్ ను డీఈఓ అశోక్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం నూతన సంవత్సరంలో అందరం కలిసి మరింత కృషి చేద్దామన్నారు. జిల్లా కమిటీ పక్షాన డీఈఓకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్, జిల్లా అధ్యక్షులు ఓ. రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్.మల్లేష్, జిల్లా కోశాధికారి ఎన్.రాజారామ్, జిల్లా కార్యదర్శులు, సాయన్న, ఆనందం, బాబులు, సొన్ పేట్ గంగాధర్, జిల్లా కమిటీ సభ్యులు రవీందర్, శంకర్, లింగన్న, శ్యామ్ రావు, కపిల్ దేవ్, ప్రేమ్ లాల్, అనంత్ తదితరులు పాల్గొన్నారు.
