నిజాంసాగర్, బతుకమ్మ : చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన కొమలంచ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన బెస్త సాయిలు(36) మహమ్మద్ నగర్ మండలం కొమలంచ శివారులోని మంజీర నదిలో మంగళవారం చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే చేపలు పట్టే వల కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
