నిజాం సాగర్, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భార్యను భర్త కీరాతకంగా కత్తితో మెడపై నరికి హత్య చేశాడు. ఈ సంఘటన బుదవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం అవుసుల తాండాలో జరిగింది. నిజాం సాగర్ ఎస్ హెచ్ఓ శివ కుమార్ కథనం ప్రకారం అవుసుల తాండాలో మేగావత్ మోతి బాయి (55) ను ఆమే భర్త షేర్య మెడపై కత్తితో నరికి హత్య చేశాడు. ఈ మేరకు పోలిసులకు సమాచారం అందడంతో వారు సంఘటన స్థలంకు చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
