బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూర్ మండల కేంద్రంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మహనీయుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేసి ఆసుపత్రి ఆవరణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి ఆవరణలో చెత్తను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కాటిపల్లి భాస్కర్ రెడ్డి మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్, తిరుమలేష్ నరేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి మహిళా మోర్చా అధ్యక్షురాలు మాలె లక్ష్మి రాకేష్, ప్రవీణ్ ,రంజిత్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

