నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఐదో టౌన్ పరిధిలో పేకాట ఆడుతున్నముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఐదో టౌన్ ఎస్ఐ ఎం.గంగాధర్ తెలిపారు. నగరంలోని ఆనంద్ నగర్ లో పేకాట ఆడుతున్నార్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4000 నగదు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
