జుక్కల్, బతుకమ్మ: మద్నూర్ మండల కేంద్రంలో రూ.305 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, ఎంపీ సురేశ్ షెట్కార్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
