అంబేద్కర్ కు నివాళులు అర్పించిన బార్ అసోసియేషన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని తెలిపారు. ఈ సమాజానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించడంలో కీలక భూమిక పోషించిన జ్ఞాని, న్యాయవాది ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వసంతరావు పిల్లి, శ్రీకాంత్, పులి జైపాల్, బిట్ల రవి, తుకారం, గంగారం, గంగా ప్రసాద్,చుక్కబొట్లరాజు ఏరేటి నారాయణ చిన్య నాయక్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


