నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కేక్ కట్ చేశారు. నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. సీనియర్ నాయకులు బాడ్సి శేఖర్ గౌడ్, బాగిర్తి బాగారెడ్డి, అగ్గు భోజన్న తదితరులు పాల్గొన్నారు.

