నాగిరెడ్డిపేట్, బతుకమ్మ : నాగిరెడ్డి పేట్ మండలం తాండూర్ గ్రామంలోని శ్రీ త్రిలింగ రామేశ్వర స్వామి వారి రుద్రయాగ హోమ మహోత్సవ కార్యక్రమానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శుక్రవారం హాజరయి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వామి వారి ఆశిస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

