28.8 C
Hyderabad
Monday, August 3, 2026

 బీఆర్ఎస్ యువజన నాయకుడి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్టలో గల తెలంగాణ భవన్లో శుక్రవారం దీక్షా దివస్ పురస్కరించుకొని జిల్లా బీఆర్ఎస్ యువజన సీనియర్ నాయకుడు అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలోమెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 60 నుంచి 70 మంది బీ ఆర్ ఎస్ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కెసిఆర్ పేరిట రక్తదానం అందివ్వడానికి ముందుకు రావడం జరిగిందని అన్నారు. దీక్షా దివస్ పేరిట తామిచ్చిన ఒక్క పిలుపుమేరకు ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరిగిందన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఐక్యతతోనేపార్టీ కార్యకర్తలు అందరం ఐక్యంగా ఉండి రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేయాలన్నారు.

More articles

Latest article