నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ఖిల్లా ప్రాంతంలో గల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. మంచి భోజనం మెనూ ప్రకారం అందించాలని తెలిపారు. హాస్టల్ పరిసరాలను సందర్శించి శుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులతో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
