నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని కోటగల్లి మాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగఘనంగా నిర్వహించారు. మాల సంఘం నుండి ప్రారంభమైన బోనాలు.. మొదట పోత లింగయ్య గుడి వద్దకు తర్వాత స్థానిక మైసమ్మ గుడికి, తర్వాత పోచమ్మ గల్లీలోని పెద్ద పోచమ్మ ఆలయానికి బయలుదేరి మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కోటగల్లి మాల సంఘం అధ్యక్షులు సక్కి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సాదు అనిల్, కోశాధికారి సక్కి రాములు, ముఖ్య సలహాదారులు సుంకరి లక్ష్మీనారాయణ,గౌరవ అధ్యక్షులు సక్కి సతీష్,జిల్లా నాయకులు నల్ల బాలరాజ్, ఉపాధ్యక్షులు నల్ల రాజారావు, ఉప కోశాధికారి నల్ల ప్రసాద్, సక్కి శ్రావణ్, నల్ల కృష్ణ సభ్యులు సాదు నారాయణ, నల్ల గంగాధర్ , తాటి పోచయ్య, గంగా శంకర్ బేగారి భూమయ్య, యువజన సభ్యులు జిట్ట సన్నీ సాదు రంజిత్ లక్క కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
