బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రం లోని టోల్ ప్లాజా సమీపంలో తెల్లవారుజామున రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాదు నుండి నాగపూర్ వెళ్తున్న డీసీఎం ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. డీసీఎం డ్రైవర్ అతివేగంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. డీసీఎం డ్రైవర్ ఇరుక్కుపోవడంతో ఏఎస్ఐ జగదీష్ ఘటన స్థలానికి చేరుకొని టోల్ ప్లాజా సిబ్బంది సహాయంతో డ్రైవర్ ని సురక్షితంగా బయటకు తీసి 108 లో కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
