బాన్సువాడ, బతుకమ్మ : నస్రుల్లాబాద్ మండలం అంకోల్ లో కొనసాగుతున్న పేకాటస్థావరంపై పోలీసులు దాడిచేసి 9 మందిని అరెస్టు చేశారు. పట్టుబడిన వారి నుంచి 9 సెల్ ఫోన్ లు, 6 బైక్ లు, రూ.1190 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లావణ్య తెలిపారు. పేకాట అడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
