మెండోరా, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 75000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. గోదావరి గేట్లు, కాలువల ద్వారా 78812 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్ట్ 16 గేట్లు ఎత్తి 49280 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల కొనసాగుతుంది. కాకతీయ ద్వారా 3500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4500 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వ ద్వారా 150 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టిఎంసిలు కాగా శనివారం సాయంత్రం 1090.7 అడుగులు, 79.263 నీరు నిల్వ ఉంది.
- 36.4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి..
శ్రీ రాసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా 36.4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు జెన్ కో డీ ఈ ఈ శ్రీనివాస్ తెలిపారు.
