నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాబోవు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు తొలగించే ప్రయత్నంలో భాగంగా శనివారం రోజున నిజామాబాద్ నగరం లో గల 5 వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు టౌన్ పరిధిలో ఖిల్లా చౌరస్తా నుండి హష్మీ కాలనీ మీదుగా శాంతి నగర్ ఈద్గా వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో నిజామాబాద్ నగర ఎసిపి ప్రకాష్ తో, పలు సీఐ లు, ఎస్సై లు, క్యు ఆర్ టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, 5వ టౌన్ సిబ్బంది పాల్గొన్నారు.

