ఏర్గట్ల, బతుకమ్మ: వెన్ను నొప్పితో బాధపడుతున్న తడపాకల్ గ్రామానికి చెందిన మహ్మద్ హిమామ్ కు చికిత్స కోసం రూ.2.50లక్షల ఎల్ వోసీని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి ముత్యాల సునీల్ రెడ్డి అందజేశారు. హిమామ్ పరిస్థితిని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు సునీల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు జింక అనిల్ యాదవ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లోలపు రాజు, అన్వేష్, శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
