రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో ఇసుక డంపులు నిల్వ ఉండడంతో, సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి 16 ట్రిప్పుల ఇసుక డంపులను సోమవారం సీజ్ చేసినట్లు రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్ నజీర్ తెలిపారు.
