. . . మందుబాబులకు రూ.13.32 లక్షల జరిమానా విధించిన కోర్టు
. . . 21 మందికి జైలు శిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు సబ్ డివిజన్ ల పరిధిలో గడిచిన వారం రోజుల్లో 150 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మందు బాబులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచగా రూ. 13,32,000 జరిమానా విధించినట్లు సిపి తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 8 వరకు ఈ కేసులు నమోదు అయ్యాయని అందులో 21 మంది మోతాదుకు మించి తాగడం, రెండోసారి పట్టుబడటంతో జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని తెలిపారు.వాహనాదారులు వాహనానికి, సంబంధించినటువంటి, పత్రములు సక్రమంగా తమ వద్ద ఉంచుకోగలరు అని తెలిపారు.

