బతుకమ్మ, మెండోరా: 1104 యూనియన్ 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్బంగా ప్లాటినం జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర కార్యవర్గం పిలుపుమేరకు ఎస్సారెస్పి జల విద్యుత్ కేంద్రం ముందు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ రఫీక్ కేక్ కట్ కట్ చేసి, జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమములో సుపరింటెండెంట్ ఇంజనీర్ పి. శ్రీనివాస్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్,1104 యూనియన్ నాయకులు, సభ్యులు, జి.గంగాధర్, కే.నాగార్జున, బి.వినోద్, టీ.అశోక్, ఆర్.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
