ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి డాక్టర్ బి గంగారెడ్డి (వాణిజ్యశాస్త్ర ఉపన్యాసకులు), టి రవీందర్ (జూనియర్ అసిస్టెంట్) జిల్లాస్థాయిలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక అయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఈ లక్ష్మీ నారాయణ తెలిపారు. సోమవారం వారిద్దరూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్, రాజేష్ చంద్ర జిల్లా ఐపీఎస్ అధికారుల చేతుల మీదుగా అప్రిషియేషన్ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక, అధ్యాపకేతర బృందం వారిద్దరిని అభినందించారు.
