నిజామాబాద్, బతుకమ్మ: మహిళలను ఎక్కడ పూజించబడతారో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్ నెస్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని వెల్ నెస్ హాస్పిటల్స్ లో శనివారం మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే మహిళా పారిశుధ్య కార్మికులను సన్మానించి చీరలు పంపిణీ చేశారు. వృత్తితో పాటు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలని వారికి సూచించారు. మహిళలు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సక్రమంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఎండీలు తాళ్ల సుమన్ గౌడ్, అసద్ ఖాన్, వివేకానంద రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
