30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కూలగొట్టిన ఇళ్ల ఈఎంఐలను ప్రభుత్వం చెల్లిస్తుందా?

Must read

📰 Generate e-Paper Clip

. శాసన మండలిలో ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, బతుకమ్మ: మూసీ నిర్వాసితుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. 309 కుటుంబాలు వారంతటవారే ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారని చెబుతున్నారని, ప్రభుత్వం కూలగొట్టిన ఇళ్లకు సంబంధించిన ఈఎంఐలను ప్రభుత్వం చెల్లిస్తుందా? అని ప్రశ్నించారు. ఇళ్లలు హృదయవిదారకమైన వీడియోలను చూస్తే ప్రభుత్వం అవాస్తవాలు చెబుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ఆ 309 కుటుంబాలు ఇళ్ల కూల్చివేతను సమ్మతిస్తూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళనకు రూ.14,100 కోట్ల వ్యయమవుతుందని, నిధులతోపాటు అనుమతులు ఇప్పించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏ ప్రాతిపదికన అడిగారని, ఒక వేళ కేంద్రాన్ని, ప్రపంచ బ్యాంకును కోరడం వాస్తవమైతే సభను, ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని కవిత ప్రశ్నించారు.

More articles

Latest article