బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలకు నీటి సమస్య లేకుండా చూడాలని డీఎల్పిఓ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరంలో నీటి ఎందటి ఉన్న గ్రామాలను గుర్తించి నీటి సమస్యను ముందుగానే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రజిత ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి ఏపీవో రాధిక పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
