ముప్కాల్, బతుకమ్మ :
ప్రతి విద్యార్థి మొదటి నుంచే ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని కష్టపడి చదివి ప్రయోజకులు కావాలని రిక్కల రాజారెడ్డి అన్నారు. ముప్కాల్ మండలంలోని రెంజర్ల ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు గురువారం రిక్కల రాజారెడ్డి సుమారు రూ. 25వేల విలువగల షూ, సాక్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జక్కుల రవికుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
