- మంగిరాములు మహారాజ్
- నందిపేటలో చలివేంద్రం ప్రారంభం
నందిపేట, బతుకమ్మ: మండల కేంద్రంలోని బస్టాండ్, పోస్టాఫీస్ ఎదురుగా సిలిండర్ లింగం ఏర్పాటు చేసిన రెండు చలివేంద్రాలను కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ శుక్రవారం ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రయాణికులు, స్థానికులకు చల్లని నీరు అందించాలనే ఉద్దేశ్యంతో వీటిని ఏర్పాటు చేసినట్లు కేదారేశ్వర ఇండియన్ గ్యాస్ ఓనర్ సిలిండర్ లింగం చెప్పారు. రాములు మహారాజ్ మాట్లాడుతూ, “వేసవిలో అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రతి గ్రామంలో ఇటువంటి చలివేంద్రాలను ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు రావాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మజరుద్దీన్, కండక్టర్ నారాయణతో పాటు స్థానికులు పాల్గొన్నారు.
