- బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
రుద్రూర్, బతుకమ్మ: ఓటర్ నమోదు పకడ్బందీగా నిర్వహించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బిఎల్ఓ లకు సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఐకేపి కార్యాలయంలో సోమవారం బిఎల్ ఓ లతో నిర్వహించిన సమావేశంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హాజరయ్యారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్ నమోదు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఓటర్ నమోదు తొలగింపు, ఫారంలు 6,7,8 పై ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఓటర్ వివరాలను సక్రమంగా ఉన్నాయా లేదా అనేది సరి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సురేందర్ నాయక్, బూత్ స్థాయి అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
