నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: పదో తరగతి ఫలితాల్లో విజయ్ హై స్కూల్ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. మొత్తం 188 మంది విద్యార్థులు పరీక్షలు రాసి వందశాతం ఉత్తీర్ణత సాధించారు. 158 మంది విద్యార్థులు 600 మార్కులకుగాను 500కుపైగా మార్కులు సాధించారు. ఇషిత 588, యూనిస్ సోషన్ 587, తనుశ్రీ 586 మార్కులు సాధించి సత్తాచాటారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను విజయ్ స్కూల్ వ్యవస్థాపకురాలు అమృతలత అభినందనలు తెలిపారు.
