24 C
Hyderabad
Sunday, August 2, 2026

డోంగ్లీ గ్రామంలో పశువైద్య శిబిరo

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పశువైద్య శిబిరాలను పశువుల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య, వైస్ ఛైర్మెన్ పరమెష్ పటేల్ తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు మద్నూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఉచిత పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు.  డోంగ్లీ మండలంలోని డోంగ్లీ గ్రామంలో ఏఎంసీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాన్ని చైర్మన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య డాక్టర్ లు మరియు డైరెక్టర్ హన్మంత్ పటేల్, శివాజీ పటేల్, దీన్ దయల్, ఆనంద్ పటేల్ , మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ పి.రమేష్, మార్కెట్ కమిటీ సూపర్వైజర్లు చందర్, సత్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article