వెబ్ న్యూస్, బతుకమ్మ : హైదరాబాద్ లోని బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా దేశవ్యాప్తంగా 1200 స్టేషన్ లు కేంద్రం ఆధునికీకరణ చేస్తోంది. ఇందులో తెలంగాణ నుంచి 40 రైల్వే స్టేషన్ లు ఎంపిక కాగా, హైదరాబాద్ నగరంలో 14 స్టేషన్ ల ఆధునికీకరణ చేపడుతున్నారు.

