బతుకమ్మ, బోధన్ : బోధన్ మున్సిపాలిటీలో శానిటేషన్ కార్మికులకు యూనిఫాంల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి , జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ పాల్గొన్నారు. శుభ్రత నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు గౌరవ సూచకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు శానిటేషన్ సిబ్బందితో మాట్లాడి వారి సేవలను ప్రశంసించారు. ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలియజేశారు.

