బతుకమ్మ : నాగిరెడ్డిపేట : హైదరాబాద్ మయూరి ఆర్ట్స్ వారు నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన ఐకెపి సిసి, త్రిలింగ రామేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షుడు కొమ్మ దత్తు కు ప్రముఖ ఉగాది పురస్కారం లభించింది. శనివారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రముఖ సినీ ఆర్టిస్టులు, టీవీనటులు, నాట్యగురువులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మ దత్తు కు వివిధ రంగాల్లో ఉన్న కళా ప్రావీణ్యాన్ని కి, సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ఉగాది పురస్కారం అందజేయడం జరిగిందని అవార్డు గ్రహీత కొమ్మ దత్తు తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత దత్తు మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిలో ఇలాంటి సత్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తాండూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి మయూరి ఆర్ట్స్ వారి ఉగాది పురస్కారం లభించడం నాగిరెడ్డిపేట మండలానికి ఎంతో గర్వకారణమని తాండూరు గ్రామ ప్రజలతో పాటు, మండల ప్రజలు, అధికారులు కొనియాడి కొమ్మ దత్తకు తమ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
